Thursday, March 28, 2024
HomeTrending Newsగర్వంగా ఉంది: కుమార్తె గ్రాడ్యుయేట్ పై జగన్

గర్వంగా ఉంది: కుమార్తె గ్రాడ్యుయేట్ పై జగన్

Proud of You: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- భారతి దంపతుల మొదటి కుమార్తె వర్ష ఫ్రాన్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. ఈ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమార్తెతో దిగిన ఫోటోను జగన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  హర్ష ఎదుగుదల తనకెంతో సంతోషంగా ఉందన్నారు.

“హర్షా, నీ ఎదుగుదలను చిన్నప్పటి నుంచీ మేము చూస్తున్నాం… ఇదో ఓ అద్భుతమైన ప్రయాణం… దేవుడి ఆశీస్సులు నీపై విస్తారంగా ఉన్నాయి, నేడు ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి డిస్టింక్షన్ తో గ్రాడ్యుయేట్ పట్టా పొందడం, అందులోనూ డీన్ జాబితా నుంచి ఈ ఘనత సాధించడం గర్వంగా ఉంది…  దేవుని ఆశీస్సులతో నీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి” అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్