Tuesday, June 9, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్త్యాగానికి మొహర్రం ప్రతీక : సిఎం జగన్

త్యాగానికి మొహర్రం ప్రతీక : సిఎం జగన్

మొహర్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు సందేశం ఇచ్చారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. మహ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీక అని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ క్యాలెండర్లో మొదటినెల కూడా మొహర్రం అని చెప్పారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మతసమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular