Sunday, June 14, 2026
HomeTrending Newsనేడు ముచ్చింతల్ కు సిఎం జగన్  

నేడు ముచ్చింతల్ కు సిఎం జగన్  

CM visit to Jeeyar Ashram: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 7న హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు. శంషాబాద్‌లోని జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సిఎం జగన్ పాల్గొంటారు.  సోమవారం  మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం 4.30 గంటలకు శంషాబాద్‌ చేరుకుని అక్కడ నుంచి శ్రీ చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి చేరుకోనున్నారు.  జీయర్‌ స్వామి ఆశ్రమంలో సహస్రాబ్ధి సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి 9.05 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు.

Also Read : సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణ చేసిన ప్రధాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular