రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్కు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. రేపు భీమవరంలో ప్రధాని మోడీతో కలిసి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఎల్లుండి కర్నూలు జిల్లా ఆదోని లో విద్యా సంవత్సరానికి గాను జగనన్న కానుక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
TRENDING NEWS
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com