Saturday, July 27, 2024
HomeTrending Newsప్రాణ నష్టం లేకుండా చూడాలి: సిఎం ఆదేశం

ప్రాణ నష్టం లేకుండా చూడాలి: సిఎం ఆదేశం

రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను, యంత్రాంగాన్ని వినియోగించుకొని తుఫాను సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అని… వీటితో పాటు విలేజ్‌ క్లినిక్స్‌, ఆర్బీకేలు కూడా ఉన్నాయని… ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపానువల్ల, భారీ వర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో తుపానుపై 8 జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు శాఖలకు చెందిన అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

సిఎం చేసిన సూచనలు:

⦿ తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది
⦿ హుద్‌హుద్‌ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను ఎదుర్కొన్నాం
⦿ తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అనుభవం ఉంది
⦿ బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని, గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు
⦿ 7వ తేదీనాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయి
⦿ ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదలచేశాం
⦿ ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం
⦿ వీరు జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు
⦿ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది
⦿ కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యం
⦿ నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం
⦿ 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం
⦿ పంట కోయని ప్రాంతాల్లో వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి
⦿ కోసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి
⦿ తేమ, రంగులాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి,  రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది
⦿ తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి:
⦿ 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు
⦿ ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5 కూడా ఉన్నాయి
⦿ సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి
⦿ మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటివి ఉండాలి
⦿ మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి
⦿ కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు
⦿ క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి
⦿ ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి
⦿ క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి
⦿ ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి
⦿ గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి
⦿ బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి
⦿ తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి
⦿ గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి
⦿ ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి
⦿ జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి
⦿ గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి
⦿ తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి
⦿ పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలి
⦿ విద్యుత్‌, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే సరిచేయాలి
⦿ సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి
⦿ తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాలి
⦿ నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను
⦿ బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి
⦿ తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను
⦿ సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి రాకూడదు
⦿ సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి:
⦿ ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు:
⦿ డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాం
⦿ ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి
⦿ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన నడవాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్