Monday, June 15, 2026
HomeTrending Newsతండ్రి వాత్సల్యం చూపారు: బిశ్వభూషణ్ కు సిఎం ధన్యవాదాలు

తండ్రి వాత్సల్యం చూపారు: బిశ్వభూషణ్ కు సిఎం ధన్యవాదాలు

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీపై వెళుతున్న రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ గవర్నర్‌గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన్ని గుర్తుంచుకుంటారని అన్నారు.  మచ్చలేని వ్యక్తిత్వం హరిచందన్‌ సొంతమని, కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులను దాటుకుని రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి మరువలేని సహకారాన్ని అందించారన్నారని ప్రశంసించారు. అధికార కార్యకాలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా, నిండైన హుందాతనంతొ వ్యవహరించారన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రం- కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంలో, వాటి మధ్య సంబంధాలు సజావుగాసాగడంలో అత్యంత కీలకపాత్రపోషించి, రాజ్యాంగానికి వన్నెతెచ్చారన్నారు. తండ్రివాత్సల్యాన్ని చూపారని, ఆత్మీయతను తెలుగు ప్రజలకు పంచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రాష్ట్రం నుంచి ఆయన వెళ్లిపోవడం బాధాకరమైనా, దేశంలో మరో రాష్ట్రానికి ఆయన గవర్నర్‌గా వెళ్లడం అక్కడి ప్రజలకు తప్పకుండా మేలుచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

మరోవైపు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయనిపుణులైన జస్టిస్‌ నజీర్‌ అనుభవం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలోనూ, రాష్ట్రానికి చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular