Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

అమెరికా కన్నా గొప్పగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బంగారు తెలంగాణలా.. బంగారు భారతదేశాన్ని తయారు చేసుకుందామని పిలుపు ఇచ్చారు. నారాయణ్ ఖేడ్ లో సోమవారం సీఎం కేసీఆర్ పర్యటించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపనం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగిస్తూ దేశ రాజకీయాలు, బిజెపి వైఖరిపై ఘాటుగా విమర్శలు సంధించారు. రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నారు. దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గుడుపుకునే దందా జరుగుతోందని, శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. దేశంలో రాజకీయం ఉండాల్సినట్టుగా లేదన్నారు.

దేశ రాజకీయాల్లో కూడా మనం కీలక పాత్ర పోషించాలన్నారు. దేశంలో రాజకీయం ఉండాల్సినట్లుగా లేదన్నారు. ఏ రకమైన తెలంగాణ ఉండాలో ప్రతీ ఒక్కరు చర్చ జరపాలని తెలిపారు. అన్ని కులాలు, వర్గాలు, మతాలు మంచిగా ఉండాలన్నారు. ఒక నారాయణ్ ఖేడ్ కే రూ.200 కోట్ల రైతుబంధు అందుతోందన్నారు. నేను పోరాటానికి బయల్దేరాను.. మీ దీవెలు కావాలని నారాయణ్ ఖేడ్ వేదికగా కెసిఆర్ తెలంగాణ ప్రజానీకాన్ని కోరారు.

ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. 10 రోజుల్లో సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సంగారెడ్డికి రూ.50కోట్లు, జహీరాబాద్ కు రూ.50 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని,నిధులు వృధా చేయకుండా ప్రజలకు ఏం కావాలో అవే చేయండన్నారు. పంచాయతీలకు ప్రతీ నెలా నిధులు పంపిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని 699 పంచాయతీలకు రూ.20లక్షలు చొప్పున రూ.140 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com