Saturday, June 13, 2026
HomeTrending Newsవివేకానందుడికి సిఎం నివాళి

వివేకానందుడికి సిఎం నివాళి

వివేకానందుని 160వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.

“‘యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవ సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు”  అంటూ సిఎం జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular