Saturday, June 13, 2026
HomeTrending Newsధరణి పోర్టల్ రద్దుకు కాంగ్రెస్ పోరుబాట

ధరణి పోర్టల్ రద్దుకు కాంగ్రెస్ పోరుబాట

వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. పీసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నేడు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పార్లమెంట్ మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్ డి ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని, ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని మరియు పలు ప్రజా, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది.

Also Read : ధరణితో సమస్యలు పెరిగాయి జీవన్ రెడ్డి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular