విక్టరీ వెంకటేష్ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం నారప్ప. తమిళ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలో రానుందని.. నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు భారీ మొత్తానికి అమ్మేశారని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై విమర్శలు వచ్చాయి. తెలంగాణా ఫిలిం చాంబర్ అక్టోబర్ వరకూ ఓ టి టి కి వెళ్ళకుండా ఆగాలని నిర్మాతలను కోరారు.
వెంకటేష్ అభిమానులు కూడా ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో వద్దని, థియేటర్లోనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఓ అభిమాని అయితే.. ఏకంగా ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ పరిణామాలతో సురేష్ బాబు ఆలోచనలో పడ్డారని.. ఓటీటీ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీని గురించి వెంకీ కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం.

తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.