Sunday, September 8, 2024
HomeసినిమాDhanush: "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" కోసం పాట పాడిన ధనుష్‌,

Dhanush: “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కోసం పాట పాడిన ధనుష్‌,

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన కొత్త సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రంలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ చిత్రాల్లో పాటలు పాడుకుంటున్నారనీ తనూ పాడుకుంటానని చెబుతూ.. అటు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ ల వద్ద ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. సరే అని మైక్ ఇచ్చారు. తీరా అతన పాడుతేంటే ప్యాన్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్‌ వాయిస్ వినిపిస్తోంది. మరి ఇదెలా సాధ్యం అంటే.. సింపుల్.. ఈ మూవీ కోసం నిజంగానే ధనుష్ పాట పాడాడు.

అనౌన్స్‌మెంట్ వీడియోలో, నవీన్ తన దర్శకుడిని మరియు నిర్మాతను తాను పాట పాడతాను అని ఒప్పించే ప్రయత్నం చూశాం. కానీ వారు అతని తమాషా ప్రయత్నాలను తిరస్కరించారు. ఈ పాట కోసం ధనుష్‌ను తీసుకువచ్చారు.”హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ..” అంటూ సాగే ఈ పాట.. ఆకట్టుకునేలా ఉంది. మే 31న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు ధనుష్‌ పాడుతున్న లిరికల్ వీడియో కూడా వస్తుంది. ఇక ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్  పై మహేష్‌ బాబు.పి డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్