రెండు వేల నోట్ల రద్దు నేపథ్యంలో దేశ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. రూ. 2వేల నోట్ల మార్పిడికి సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది.
రూ.2వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి చేసుకున్నప్పుడు ఎలాంటి గుర్తింపు పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎటువంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఒకసారి గరిష్ఠంగా రూ.20 వేల విలువ చేసే రూ. 2వేల నోట్లు డిపాజిట్ చేయటం లేదా మార్పిడి చేసుకోవచ్చని వెల్లడించింది.