Saturday, September 21, 2024
HomeTrending Newsజమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌...ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌…ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు చనిపోయాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు. అతడు ఏ గ్రూప్‌కు చెందినవాడనే విషయాన్ని గుర్తించాల్సి ఉందని చెప్పారు.

పుల్వామాలో కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదుల కాల్చి చంపిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. పుల్వామా జిల్లాలోని అచన్‌కు చెందిన సంజయ్‌ శర్మ అనే కశ్మీరీ పండిట్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి స్థానిక మార్కెట్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు ఆయనను ఛాతిపై కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలించేలోపే ప్రాణం పోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 నుంచి 9 మంది పండిట్లను ఉగ్రవాదులు కాల్చి చంపారని స్థానికులు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్