Sunday, May 19, 2024
HomeTrending Newsధాన్యం కొనుగోలుకు ఆంక్షలు వద్దు జీవన్ రెడ్డి

ధాన్యం కొనుగోలుకు ఆంక్షలు వద్దు జీవన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి,58 ఏళ్ళకే వృద్దాప్య పింఛను,రైతులకు లక్ష రుణమాఫీ వంటివి నేటికీ ఆచరణలోకి రాకపోవడాన్ని బట్టి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏపాటి చిత్త శుద్ధి ఉందొ అర్థమవుతుందని ఆరోపించారు. సోమవారం జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి మహిళా సంఘం సభ్యులు నెల నెల ఎంతమోత్తo బ్యాంకులో జమ చేస్తారో ప్రభుత్వం కుడా అంతే మొత్త్తాన్ని జమాచేస్తూ అభయహస్తం పేరుతో మహిళలకు 500రూపాయల పింఛన్ ఇచ్చిందని, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దీన్ని నిలిపివేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా
మహిళా సంఘం సభ్యులు సమకూర్చిన 600 కోట్ల సొమ్మును అరేళ్లుగా ప్రభుత్వం దగ్గరే ఉంచుకుని లబ్దిదారులకు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఆడబిడ్డల సొమ్ము తింటే పేరుకు రాకుండా పోతారని వాయిదాల ప్రకారం కాకుండా ఒకేసారి వెంటనే డబ్బులు అందజేయాలన్నారు.

రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చినంకా ఏ ఒక్క కొత్త పింఛన్లు ప్రభుత్వం ఇవ్వడంలేదని, నిరుద్యోగ భృతి ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. టెట్ అర్హత పరీక్షకు 6 లక్షల మంది దరఖాస్థులు చేసుకున్నారని వీరందరు నిరుద్యోగులు కాదా అని ఆయన ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.ఎపిలో భాష పండితులకు టెట్ లో 3 వ పేపర్ రూపొందించారని, కాని తెలంగాణలో భాష పండితులకు ప్రత్యేక పేపర్ లేదని, ప్రభుత్వం వీరికి 3 వ పేపర్ రూపొందించాలని సూచించారు. మార్చి నెలాఖరులోపు రైతులకు 50 వేల రుణమాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో శాసనసభలో ప్రకటించిన అమలుకావడంలేదని, బడ్జెట్ ప్రసంగానికి కుడా ప్రభుత్వం విలువ ఇవ్వడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోనైనా రైతులకు ప్రభుత్వం 50 వేల రుణమాఫీ చేసి ప్రభుత్వం విశ్వసనీయతనునిలబెట్టుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు. రెండు సంవత్సరాలు ఇబ్బందులు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించి ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదని విమర్శిస్తూ తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ వ్యవసాయ విధానంలో స్పష్టత లేదని, నిర్భంద సాగుపేరుతో,వరి వేయద్దనే ప్రభుత్వ ప్రకటనతో యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదని వివరించారు. రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం లక్ష్యం కాగా క్వింటలకు 300 చొప్పున కేవలం 1500 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని, రైతులకోసం ప్రభుత్వం భరించుకోలేదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తిరిగి ప్రభుత్వం వరి ధాన్యం కొంటామని చెప్పడంతో అన్నీ సౌకర్యాలుండి వరి వేయని రైతులకు ఎకరానికి 10 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సూపర్ ఫైన్ రకం ధాన్యాన్ని కామన్ రకం ధాన్యంతో కలుపుతామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి మాట్లాడడం సరికాదన్నారు. సమావేశంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళేపెల్లి దుర్గయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ ఎంపిపి ధర రమేష్ బాబు, మాజీ కౌన్సిలర్ పుప్పాల అశోక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బండ శంకర్, బీరం రాజేష్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : మాట తప్పిన సిఎం – జీవన్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్