Wednesday, April 17, 2024
HomeTrending Newsవిశాఖలో నలుగురు విద్యార్ధినుల మిస్సింగ్

విశాఖలో నలుగురు విద్యార్ధినుల మిస్సింగ్

విశాఖపట్నం లోని క్వీన్ మేరీ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు.  వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో విద్యార్హినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.  నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడం తో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మిసింగ్ కేసు మిస్టరీ ను ఛేదించే పనిలో పోలీసులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అన్ని పోలీసు గ్రూపుల్లో,వలంటరి గ్రూప్ ల్లో అలర్ట్ చేశారు. వారు రాసినట్లుగా చెబుతున్న ఒక లెటర్ లభ్యమైంది. తమకోసం వెతకవద్దని, తమ కాళ్ళమీద తాము నిలబడేందుకే దూరంగా వెళ్తున్నామని, మంచి పొజీషన్ లోకి వచ్చిన తరువాత తిరిగి వస్తామని రాసి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్