Thursday, March 19, 2026
HomeTrending NewsVirat Kohli: రాణించిన కోహ్లీ, రోహిత్- తొలి వన్డేలో ఇండియా విజయం

Virat Kohli: రాణించిన కోహ్లీ, రోహిత్- తొలి వన్డేలో ఇండియా విజయం

కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 373 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య సాధనలో లంక 8 వికెట్లు కోల్పోయి306  పరుగులు చేయగలిగింది.

గువహటి బర్సప్ప క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు రోహిత్- గిల్ 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాదులు వేశారు. గిల్-70 (60  బంతుల్లో 11 ఫోర్లు) చేసి ఔట్ కాగా, రోహిత్-83 ( 67 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్సర్లు) రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటి 87  బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 113 పరుగులు చేసి 49వ ఓవర్లో ఔటయ్యాడు.  కెఎల్ రాహుల్-39, శ్రేయాస్ అయ్యర్-28 పరుగులు చేశారు. లంక బౌలర్లలో రజిత 3; మధుశనక, కరుణరత్నే, శనక, ధనుంజయ డిసిల్వా తలా ఒక వికెట్ సాధించారు.

భారీ లక్ష్య సాధనలో తడబడిన లంక 19 పరుగులకే మొదటి వికెట్ (ఫెర్నాండో-5) కోల్పోయింది. మరో ఓపెనర్ పాతుమ్ నిశాంక 72; ధనుంజయ డిసిల్వా-47 పరుగులు చేశాడు. కెప్టెన్ శనక 88 బంతుల్లో 12  ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి అజయంగా నిలిచాడు, శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేయగలిగింది.

ఇండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3; సిరాజ్ 2; షమీ, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కోహ్లీకి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular