Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్మూడో టి 20 లో ఇండియాదే విజయం

మూడో టి 20 లో ఇండియాదే విజయం

జింబాబ్వేతో జరుగుతోన్న టి 20 సిరీస్ లో మూడో మ్యాచ్ లో ఇండియా 23 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేయగా లక్ష్య సాధనలో ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేయగలిగింది.

ఇండియా తొలి వికెట్ (యశస్వి జైస్వాల్-37) కు 67 రన్స్ చేసింది. గిల్-66; అభిషేక్ శర్మ-10; రుతురాజ్ గైక్వాడ్ – 49 పరుగులు చేసి ఔట్ కాగా, శామ్సన్-12; రింకూ సింగ్-1  పరుగుతో నాటౌట్ గా ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబని, సికిందర్ రాజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

లక్ష్య సాధనలో జింబాబ్వే 39 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కోల్పోయింది. సికిందర్ రాజా 65 ; క్లైవ్ మదండే-37 పరుగులతో రాణించారు. మిగిలినవారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3; అవేష్ ఖాన్ 2; ఖలీల్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు.

సుందర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular