Tuesday, March 17, 2026
Homeస్పోర్ట్స్Women’s T20 WC: ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమి

Women’s T20 WC: ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమి

టి 20 వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఇండియా మహిళలు నేడు ఇంగ్లాండ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. 152 పరుగుల లక్ష్య సాధనలో భారత మహిళలు 20 ఓవర్లకు 5 వికెట్లు 140 పరుగులు చేయగలిగారు.

టాస్ గెలిచిన ఇండియా  బౌలింగ్ ఎంచుకుంది.  రేణుకా సింగ్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. తర్వాత… నటాలి స్కివర్-50;  అమీ జోన్స్-40;  కెప్టెన్ హైదర్ నైట్ 28 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 స్కోరు చేసింది. రేణుక మొత్తం ఐదు వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే, దీప్తి శర్మ లకు చెరో వికెట్ దక్కింది.

స్మృతి మందానా ధాటిగా ఆడుతున్నా సహచరులు వెంట వెంట ఔటయ్యారు. షఫాలీ (8); జెమైమా రోడ్రిగ్యూస్ (13); కెప్టెన్ హర్మన్ ప్రీత్ (4) విఫలమయ్యారు. స్మృతి-రిచా ఘోష్ లు నాలుగో వికెట్ కు 43 పరుగులు జోడించారు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 52 పరుగులు చేసిన స్మృతి 105 పరుగుల వద్ద ఔటయ్యింది. దీప్తి శర్మ 7 పరుగులు చేసి రనౌట్ కాగా, రిచా ఘోష్ చివర్లో మెరుపు షాట్లు ఆడినా ప్రయోజనంలేకుండా పోయింది. రిచా 34 బంతుల్లో 4 ఫోర్లు. 2 సిక్సర్లతో 47 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో సారా గ్లెన్ రెండు; ఎక్సెల్ స్టోన్, లారెన్ బెల్ చెరో వికెట్ సాధించారు.

నటాలి స్కివర్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular