Monday, March 16, 2026
HomeTrending Newsఅది ప్రభుత్వ భవనం : మంత్రి బొత్స

అది ప్రభుత్వ భవనం : మంత్రి బొత్స

రిషికొండపై నిర్మిస్తున్నది  ప్రభుత్వ కట్టడమని అది ప్రభుత్వ ఆస్తి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనిలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు లేవని తేల్చి చెప్పారు.  అది ప్రభుత్వ  భవనం గానే ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనం కడితే తప్పేమిటని నిలదీశారు,

పవన్ కళ్యాణ్ నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని,ఆయన మాట్లాడే అన్ని మాటలకూ తాము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అక్కడ ఏవైనా ఉల్లంఘనలు జరిగితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులు ఉన్నాయని, రాజ్యంగానికి వ్యతిరేకంగా  తాము వెళ్ళడం లేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular