Friday, April 19, 2024
HomeTrending News రైతు శత్రువు పార్టీ బిజెపి

 రైతు శత్రువు పార్టీ బిజెపి

40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెబుతోందని, ఎఫ్సిఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే రాత పూర్వకంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్రం వైఖరిని తప్పు పట్టారు. ఏ రాష్ట్రంలో లేనిది, తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని అడుగుతున్నారని, తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంతగా పంట పండిందన్నారు. అందుకే అదనపు కొనుగోళ్లు చేయాలని మేము కోరుతున్నాం

40 లక్షల టన్నుల బియ్యానికి అగ్రిమెంట్ జరిగింది. మేము మిల్లు పట్టి ఇస్తే, కేంద్రం తీసుకోవాలని, అయితే, ఈ టార్గెట్ పూర్తయింది. ఇంకా మార్కెట్ యార్డుల్లో, పంట కల్లాల్లో, కోతలు ఇంకా పూర్తికాని వరి ఉందని జగదీష్ రెడ్డి వివరించారు. బీజేపీ నేతలు బొక్కబోర్లా పడడం ఖాయమని, కెసిఆర్ నుంచి రైతాంగాన్ని విడదీయడం మీకు(BJP) సాధ్యం కాదన్నారు. రెండ్రోజుల్లో చెబుతాం అన్నారు కాబట్టి మేము ఢిల్లీలో ఆగామని, ఉత్తరం ఇస్తే మేమెందుకు ఢిల్లీలో ఉంటాం. ఇస్తే వెళ్లిపోయేవాళ్ళం కదా అని మంత్రి తెలిపారు. రూ. 16,000 కోట్ల కుంభకోణం అంటున్న కాంగ్రెస్ నేతలు.. అసలు పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓ చిల్లర పార్టీ.. ఓ నాయకుడు లేడు ఏం లేడు..రాజకీయ ప్రయోజనాల తప్ప రైతుల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదని ఆరోపించారు. ఎవరు రైతుల కోసం పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదని విషయాన్ని తెలంగాణ సమాజం చూస్తోందని, కాంగ్రెస్ కూడా బిజెపికి తోక పార్టీల వ్యవహిరిస్తోందన్నారు.

40 లక్షల టన్నుల బియ్యానికి ఎంవోయూ చేసినోళ్లు, అదనపు సేకరణపై లెటర్ ఇవ్వడానికి ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదో వాళ్లే చెప్పాలని మంత్రి అన్నారు. మిల్లు పట్టి బియ్యం రెడీ చేసి ఉంచాం. తీసుకెళ్ళాల్సిన బాధ్యత వారిది. రైల్వే వారిది. తీసుకెళ్లకుండా తాత్సారం చేస్తున్నది వాళ్ళు. పీయూష్ గోయల్ వ్యాపారి. వ్యాపార ప్రతినిధి. వారికి వ్యాపార ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవు. 2014 తర్వాత వ్యవసాయం రంగం ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో చెప్పాలి. విషయం పక్కదారి పట్టించేందుకు.. ఎన్నికల మాట మాట్లాడుతున్నారు. రైతుల అంశంలో ఎన్నికలకు ఏం సంబంధం. రైతుల నుంచి తన్నులు తప్పించుకునేందుకు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. బిజెపి పార్టీ రైతులను శత్రువులుగా చూసే పార్టీ అని పార్లమెంట్ సాక్షిగా చెప్పినట్టే లేఖ ఇవ్వాలని అడుగుతున్నామని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : ప్రధానితో వైసీపీ ఎంపీల భేటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్