Monday, July 1, 2024
Homeస్పోర్ట్స్కబడ్డీ: జైపూర్ విన్, బెంగాల్-తెలుగు మ్యాచ్ టై

కబడ్డీ: జైపూర్ విన్, బెంగాల్-తెలుగు మ్యాచ్ టై

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో గుజరాత్ పై జైపూర్ గెలుపొందగా, బెంగాల్-తెలుగు టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై గా ముగిసింది.

జైపూర్ పింక్ పాంథర్స్- గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 36-31 తో జైపూర్ విజయం సాధించింది. మొదటి భాగంలో 20-14తో జైపూర్ ఆధిక్యం ప్రదర్శించింది. రెండోభాగంలో గుజరాత్ 17-16తో ఒక పాయింట్ పైచేయి సాధించినా మ్యాచ్ ముగిసే సమయానికి ఐదు పాయింట్ల తేడాతో జైపూర్ గెలుపు సొంతం చేసుకుంది. జైపూర్ రైడర్లు దీపక్ హుడా-11; అర్జున్ దేశ్వాల్-7 పాయింట్లు సాధించి జట్టు విజయానికి దోహదపడ్డారు.

బెంగాల్ వారియర్స్-తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ 32-32తో టై అయ్యింది. తొలి అర్ధ భాగంలో 14-12తో  బెంగాల్ స్వల్ప ఆధిక్యం సంపాదించింది. రెండో భాగంలో తెలుగు టైటాన్స్  పుంజుకుని ఆడి బెంగాల్ ను నిలువరించారు, 20-18తో పైచేయి సాధించారు. దీనితో మ్యాచ్ సమయం ముగిసేనాటికి ఇద్దరూ చెరో 32 పాయింట్లు సాధించారు. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ -11; తెలుగు రైడర్ అంకిత్ బేణీవాల్-9 పాయింట్లతో రాణించారు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (60 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (57); బెంగుళూరు బుల్స్ (55); హర్యానా స్టీలర్స్(53); జైపూర్ పింక్ పాంథర్స్ (51); యూ ముంబా (48) టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: పాట్నా, గుజరాత్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్