Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవా జట్లు తమ ప్రత్యర్థులపై విజయం సాధించాయి.
జైపూర్ పింక్ పాంథర్స్ – పాట్నా పైరేట్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 51-30 తో జైపూర్ ఘన విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 25-11తో భారీ ఆధిక్యం ప్రదర్శించిన జైపూర్ రెండో అర్ధభాగంలోనూ అదే దూకుడు చూపి 26-19తో పైచేయి సంపాదించింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి జైపూర్ 21 పాయింట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. జైపూర్ ఆటగాళ్ళు జైశ్వాల్ 17; దీపక్ హుడా-8 పాయింట్ల సాధించి జట్టు ఘన విజయంలో కీలక భూమిక పోషించారు.
తమిల్ తలైవాస్-బెంగుళూరు బుల్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 42-24తో తమిళ్ తలైవాస్ ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 21-8తో తిరుగులేని పైచేయి సంపాదించిన తమిళ్ రెండోభాగంలోనూ 21-16తో రాణించింది. మొత్తానికి 18 పాయింట్ల తేడాతో విజయం దక్కించుకుంది.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… దబాంగ్ ఢిల్లీ (48 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (46); పాట్నా పైరేట్స్ (45); హర్యానా స్టీలర్స్ (42); యూ ముంబా (41); బెంగాల్ వారియర్స్ (41); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: గుజరాత్ పై ఢిల్లీ ఘన విజయం