Thursday, May 30, 2024
Homeసినిమాఅజిత్ తో నాలుగో సినిమా కూడా చేస్తా : బోనీ క‌పూర్‌

అజిత్ తో నాలుగో సినిమా కూడా చేస్తా : బోనీ క‌పూర్‌

Valimai:  కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్ కుమార్ హీరోగా జీ స్టూడియోస్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల పై హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్ నిర్మించిన చిత్రం ‘వ‌లిమై’. ఐవీవై ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా వ‌లిమై చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు గోపీచంద్ ఇనుమూరి అందిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 24న ‘వ‌లిమై’ విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ క‌పూర్ మాట్లాడుతూ… ‘నేను బాలీవుడ్ నిర్మాతనే అయినా నా మనసెప్పుడూ దక్షిణాాది సినమాల పైనే ఉంటుంది. బాపు గారు డైరెక్ట్ చేసిన మ‌న‌వూరి పాండవులు సినిమాను హిందీలో హ‌మ్ హై పాంచ్ అనే పేరుతో రీమేక్ చేశాను. అలా తెలుగు సినిమాను రీమేక్ చేయడం ద్వారానే నా కెరీర్‌ను ప్రారంభించాను. బాపు గారు ద‌ర్శ‌కుడిగా నాకెన్నో కొత్త విష‌యాల‌ను నేర్పించారు. కాద‌ల్ కోటై, వాలి సినిమాల నుంచి అజిత్ గారితో మంచి అనుబంధం ఉంది. కాద‌ల్ కోటై చిత్రాన్ని హిందీలో నేనే రీమేక్ చేశాను. ఇక అజిత్‌తో మూడు సినిమాలు చేసే అవ‌కాశం ద‌క్కింది. మూడో సినిమాను కూడా వినోద్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాలుగో సినిమాను కూడా చేస్తాం.

అజిత్‌, వినోద్ ఇద్ద‌రూ రిస్క్ తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉంటారు. ఫోక‌స్‌గా ఉంటారు. వారు ఎంటైర్ టీమ్‌ను ముందుకు న‌డిపించారు. అద్భుత‌మైన జ‌ర్నీ. ఈ జ‌ర్నీ ఇంకా కొన‌సాగ‌నుంది. ఇక కార్తికేయ చూడ‌టానికి సింపుల్‌గా, కూల్‌గా క‌నిపిస్తున్నాడు కానీ.. స్క్రీన్‌పై బ‌బ్బ‌ర్ షేర్‌లా యాక్ట్ చేశాడు. త‌న‌ను చూస్తే భ‌య‌ప‌డ‌తాం అలా న‌టించాడు. తెలుగులోనూ సినిమాలు చేయాల‌ని ఎదురు చూస్తున్నాను. నా కుమార్తె జాన్వీ క‌పూర్ త‌ప్ప‌కుండా తెలుగులో సినిమా చేస్తుంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తోంది. తెలుగులోనే కాదు, త‌మిళం స‌హా ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఆమె న‌టించ‌డానికి సిద్ధంగా ఉంది. పిబ్రవరి 24న రిలీజ్ అయ్యే ‘వలిమై’ సినిమా ఆడియెన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది ’’ అన్నారు.

Also Read : నాడు ‘జయం’ … నేడు ‘విక్రమాదిత్య’

RELATED ARTICLES

Most Popular

న్యూస్