Friday, March 13, 2026
HomeTrending Newsఆస్ట్రేలియాలో భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి

ఆస్ట్రేలియాలో భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో దారుణం చోటు చేసుకున్నది. భారత జాతీయ జెండాను పట్టుకున్న భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా, 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 రోజుల వ్యవధిలో మెల్‌బోర్న్‌లోని 3 హిందూ దేవాలయాలు వీరి చేతిలో ధ్వంసమైనట్లుగా తెలుస్తున్నది. ఇదే నేపథ్యంలో ఈ సంఘటన జరగడం మరింత ఆందోళన పెంచుతున్నది.

భారతదేశంలో నిషేధిత సంస్థ అయిన సిక్స్‌ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) మెల్‌బోర్న్‌ ఫెడరేషన్ స్క్వేర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఖలిస్తాన్‌ జెండాలు చేత పట్టుకుని నినాదాలు చేశారు. ఇంతలో 25-30 మంది యువకులు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ ఫెడరేషన్ స్క్వేర్ వైపు ర్యాలీ నిర్వహించారు. వీరి చేతుల్లో భారత జాతీయ జెండాలు ఉన్నాయి. వీరిని చూడగానే ఖలిస్తాన్ మద్దతుదారులు ఒక్కసారి వారిపైకి దాడికి పాల్పడ్డారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువకులపై కర్రలతో దాడి చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఖలిస్తాన్ జెండా పట్టుకున్న పలువురు త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న భారతీయులపై విరుచుకుపడటం ఈ వీడియోలో చూడవచ్చు. ఖలిస్తానీ మద్దతుదారుల చేతుల్లో  లాఠీలు కనిపిస్తున్నాయి. రైతుల ఉద్యమం సమయంలోనూ ఆస్ట్రేలియాలో భారత వ్యతిరేక కార్యకలాపాలను ఖలిస్తానీ మద్దతుదారులు కొనసాగించారు. ఖలిస్తాన్‌ మద్దతుదారులు ఎక్కువగా కెనడా, అమెరికాలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular