Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయాలి అనుకున్నారు. అయితే.. కొరటాల తెరకెక్కించిన ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో కథ పై మళ్లీ కసరత్తు చేయమన్నారు ఎన్టీఆర్. కొరటాల కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా కొరటాల చెప్పిన స్టోరీకి ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ క్రేజీ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ను చూపించని విధంగా సరికొత్తగా, పవర్ ఫుల్ గా చూపించేందుకు కొరటాల అదిరిపోయే స్టోరీ రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ చిత్రాన్ని ఇంకా స్టార్ట్ చేయకుండానే 2024లో ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఫిబ్రవరిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. తారకరత్న మరణించడంతో ఈ మూవీ ఒపెనింగ్ ని వాయిదా వేశారు. మార్చి ప్రధమార్థంలో ఈ చిత్రాన్ని భారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలాఖరు నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటించనుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలతో అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.

అలాగే కీలక పాత్రల్లో సంజయ్ దత్, విక్రమ్ నటింనున్నట్టుగా వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా మూవీ కాబట్టి తమిళ్ నుంచి ఓ స్టార్, బాలీవుడ్ నుంచి ఓ స్టార్ తో కీలక పాత్రలు చేయించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కాలేదని… ఆలస్యం అవుతుంది కాబట్టి రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది కానీ.. రిలీజ్ డేట్ లో మార్పు ఉండదని తెలిసింది. ప్రకటించినట్టుగానే 2024లో ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నారు. మరి.. ఎన్టీఆర్, కొరటాల ఈ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com