Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్Korea Open: తొలిరోజు ఇండియాకు నిరాశ

Korea Open: తొలిరోజు ఇండియాకు నిరాశ

కొరియా ఓపెన్-2023లో ఇండియాకు నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి మినహా నేడు ఆడిన మిగిలిన ఆటగాళ్ళు ఓటమి పాలయ్యారు.

సాత్విక్-చిరాగ్ జోడీ 21-16; 21-14 తేడాతో థాయ్ లాండ్ ద్వయం సుపాక్ జోమ్కో-కిట్టినుపొంగ్ కెడ్రెన్ పై విజయం సాధించి రెండో రౌండ్ లో అడుగు పెట్టారు.

పురుషుల సింగిల్స్ లో శంషావత్ దలాల్, అర్షిత్ అగర్వాల్ ఓటమి పాలై నిష్క్రమించారు. కాగా, పురుషుల డబుల్స్ లో ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల జోడీ గాయం కారణంగా తొలి సెట్ మధ్యలోనే వెనుదిరిగారు.

రేపు బుధవారం భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్, పివి సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్