Thursday, April 18, 2024
HomeTrending Newsఢిల్లీలో తెరాస భవనం అస్తిత్వ చిహ్నం

ఢిల్లీలో తెరాస భవనం అస్తిత్వ చిహ్నం

ఢిల్లీలో నూతన తెరాస భవనం తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ చిహ్నమని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు కె. చంద్రశేఖర్ రావు  చేతుల మీదుగా ఊపిరిపోసుకున్న టీఆర్ఎస్ ఇవ్వాళ అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యా లయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్ర  సన్నివేశమన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు టిఆర్ఎస్ పార్టీ చరిత్రలోను శాశ్వతంగా నిలిచిపోతుందని పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అన్నారు. ఈ సందర్భంగా రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియను మంత్రి కేటీఆర్ పస్ర్తావించారు. 14 ఏళ్ల ఉద్యమ పస్ర్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నో సవాళ్లను ఎదుర్కొ న్నదని, తెలంగాణ పదమే నిషిద్ధమైన రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రసమితి కార్యా లయం ఉన్న జలదృశ్యం నుండి సామాన్లు అన్నీ రోడ్డున పడేసిన చందబ్రాబు కక్షపూరిత పాలన, తదనంతరం తెలంగాణ ఆశను చిదిమేయాలని చూసిన వైయెస్సా ర్ పాలన వరకు ఎదురైన అన్ని అడ్డంకులన్నీ ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ టిఆర్ఎస్ ముందుకు సాగిందన్నా రు.

రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటూ, చిక్కు ముళ్లని విప్పుకుంటూ, తెలంగాణ గల్లీలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూనే అటు ఢిల్లీ పవర్ కారిడార్ల లాబీయింగ్ ద్వారా తెలంగాణ ఆకాంక్షకు కెసిఆర్ విస్తృతంగా మద్ధతు కూడగట్టారన్నారు. తన తొలి అడుగే త్యాగంతో మొదలు పెట్టిన ఆయన నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకులు ఎన్నో సార్లు పదవులను పూచిక పుల్లల్లా విసిరేశారన్నారు. అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ అంశంపై ఎన్ని దాగుడుమూతలు ఆడినా, మడమతిప్పకుండా ఉద్యమాన్ని కొనసాగించి, చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి చివరికి డిల్లీ మెడలు వంచి ఆరు దశాబ్దాల ఆకాంక్షను కెసిఆర్ నెరవేర్చారన్నారు.

గత ఏడేళ్ల స్వయం పాలనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అప్రతిహతంగా పురోగమిస్తున్నదని, తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ , ఉమ్మడిపాలనలో జరిగిన విధ్వంసం నుండి ఒక మహత్తరమైన పునర్నిర్మా ణం దిగ్విజయంగా కొనసాగుతున్నదని కేటీఆర్ అన్నా రు. ఉద్యమానికి ముందు పత్ర్యేక రాష్ట్రానికి తర్వాత సైతం రెండు దశాబ్దాలుగా తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పర్యాయ పదంగా తెలంగాణ రాష్ట్రసమితి నిలిచిందంటే అతిశయోక్తి కానేకాదన్నా రు. తెలంగాణ సాధన, పునర్నిర్మాణం అనే రెండు చారిత్రక కర్తవ్యాలను విజయవంతంగా నెరవేర్చిన తెరాస పార్టీకి ఇప్పు డు దేశ రాజధానిలో ఒక గొప్ప కార్యా లయం నిర్మించడానికి ఇవ్వాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా భూమిపూజ జరిగిందని, తెలంగాణ నుండి వచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తల నడుమ ఒక పండుగలా ఈ వేడుక జరిగిందన్నా రు.

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటలాగ, ఇవ్వా ళ తెలంగాణ గులాబీ పతాకం ఢిల్లీ గడ్డ మీద రెపరెపలాడటం తెలంగాణ బిడ్డగా ఒక గొప్ప భరోసాను ఇస్తుందని కేటీఆర్ అన్నా రు. దక్షిణ భారత దేశం నుండి ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో ఒక కార్యాలయం స్థాపించడం ఇది రెండవది కావడం టీఆర్ఎస్ శ్రేణ్రేులకు గర్వకారణమన్నారు.  ఈ సందర్భంగా పార్టీ కోసం అనునిత్యం పాటుపడుతున్న పార్టీ పజ్రాప్రతినిధులకు, నాయకులకూ, కార్యకర్తలకూ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్