Thursday, April 18, 2024
Homeసినిమాజ‌న‌తా బార్ లో.. ల‌క్ష్మీరాయ్

జ‌న‌తా బార్ లో.. ల‌క్ష్మీరాయ్

Janatha Bar: రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతా బార్. రమణ మొగిలి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థనారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకం పై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణమొగిలి తెలియజేస్తూ.. రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ని ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేయడం గర్వంగా ఉందని అన్నారు.

స్పోర్ట్స్‌ ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళల పై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హారాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఆధారంగా కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న సినిమా ఇది. తప్పకుండా చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుందని ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్న రాజేంద్ర భరద్వజ్ తెలియచేశారు. ఈ చిత్రంలో శక్తికపూర్, ప్రదీప్‌రావత్, సురేష్, అనూప్‌సోని, అమన్ ప్రీత్, భూపాల్ రాజ్, విజయ్‌భాస్కర్, ఉన్ని కృష్ణ, దీక్షాపంత్, అమీక్ష, మిర్చిమాధవి, తదితరులు న‌టిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్