Tuesday, June 9, 2026
HomeTrending Newsరేపు రోశయ్య అంత్యక్రియలు

రేపు రోశయ్య అంత్యక్రియలు

Last Rituals Of Rosaiah :

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య  అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం కొంపల్లిలోని అయన వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. మొదట జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరపాలని అనుకున్నా, కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు కొంపల్లికి మార్చినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత డా. కేవీపీ రామచంద్రరావు వెల్లడించారు. నేటి ఉదయం స్టార్ ఆస్పత్రి నుంచి అయన భౌతికకాయాన్ని ధరమ్ కరణ్ రోడ్డులోని అయన స్వగృహానికి తరలించారు. కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న అనుబంధం దృష్ట్యా రేపు ఉదయం 9 గంటలకు గాంధీభవన్ కు అయన భౌతికకాయాన్ని తరలిస్తామని, అక్కడినుంచి కొంపల్లికి తీసుకు వెళతామని వివరించారు.

Also Read : రాజకీయ దురంధరుడు రోశయ్య కన్నుమూత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular