Monday, May 20, 2024
Homeసినిమామ‌హేష్‌, రాజ‌మౌళి మూవీ మ‌రింత ఆల‌స్యం

మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీ మ‌రింత ఆల‌స్యం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో మూవీ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై డా.కె.ఎల్ నారాయ‌ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి మ‌హేష్ తో చేయ‌నున్న మూవీకి సంబంధించిన క‌థ పై వ‌ర్క్ చేస్తున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు.

అయితే.. ఆగ‌ష్టు 1 నుంచి షూటింగులు బంద్ అని ప్ర‌క‌టించారు. ఆగ‌ష్టులో మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ స్టార్ట్ కావాలి. ఆగ‌ష్టు రెండో వారంలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఈలోపు నిర్మాత‌లు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుక్కుంటే.. ముందు అనుకున్న‌ట్టుగా మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. లేక‌పోతే ఇంకాస్త ఆల‌స్యం అవ్వ‌చ్చు. ఈ మూవీని డిసెంబ‌ర్ నెలాఖ‌రుకి కంప్లీట్ చేయాలి అనేది ప్లాన్.

జ‌న‌వ‌రి నుంచి రాజ‌మౌళితో సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ.. జ‌న‌వ‌రిలో కూడా ఈ సినిమా సెట్స్ పైకి వ‌చ్చే ఛాన్స్ లేద‌ని టాక్ వినిపిస్తోంది. అందుచేత మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీ మ‌రింత ఆల‌స్యం కానుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : ఆగ‌ష్టు 1 నుంచి షూటింగులు బంద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్