Friday, April 19, 2024
Homeసినిమామ‌హేష్‌.. మ‌రో క్రేజీ మూవీకి ఓకే చెప్పారా..?

మ‌హేష్‌.. మ‌రో క్రేజీ మూవీకి ఓకే చెప్పారా..?

Mahesh -Sukku: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నెక్ట్స్ మూవీని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా జులై రెండో వారంలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా పూర్తైన త‌ర్వాత 2023 జ‌న‌వ‌రి నుంచి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో భారీ పాన్ ఇండియా మూవీ చేయ‌నున్నారు. అయితే.. ఇప్పుడు మ‌హేష్ మ‌రో క్రేజీ మూవీకి ఓకే చెప్పార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ ఎవ‌రితో అంటారా.. పుష్ప మూవీతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో. గతంలో మ‌హేష్ బాబు, సుకుమార్ క‌లిసి 1 నేనొక్క‌డినే అనే సినిమా చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా మహేష్, సుకుమార్ ల కెరీర్ లో బెస్ట్ వర్క్ గా నిలిచింది. అప్పట్లో మహేష్ ఏ సినిమాకి చేయని హార్డ్ వర్క్ ఈ మూవీకి చేశారు. దీంతో ఈ సినిమాకి ఎనలేని హైప్ వ‌చ్చింది.

ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా పడితే చూడాలని ఎప్పుడు నుంచో అభిమానులు అనుకుంటున్నారు. ఆమ‌ధ్య ఈ క్రేజీ కాంబినేష‌న్ సెట్ అవుతుంది అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో సినిమా  క‌న్ ఫ‌ర్మ్ అయ్యింద‌ని టాక్. ఈ క్రేజీ, భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ని స‌మాచారం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్