Saturday, April 20, 2024
Homeసినిమానిర్మాతగా మారిన మెగా డాటర్ సుస్మిత

నిర్మాతగా మారిన మెగా డాటర్ సుస్మిత

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్ 22). ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించ‌నున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ అనే పేరుతో వస్తోన్న ఈ క్యూట్ ల‌వ్‌స్టోరిలో యువ క‌థానాయ‌కుడు సంతోశ్ శోభ‌న్, ‘జాను’లో చిన్న‌నాటి స‌మంత పాత్ర‌లో న‌టించిన గౌరి జి.కిష‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే .. సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ ద‌గ్గ‌ర‌గా నిలుచుకుని క‌ళ్లు మూసుకుని ప్రేమ త‌న్మ‌యత్వంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంటే, బ్యాగ్రౌండ్‌లో ఓ రంగుల ఇల్లు క‌నిపిస్తుంది. క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరిగా రూపొందనున్న `శ్రీదేవి శోభ‌న్‌బాబు`తో సుష్మిత కొణిదెల‌ తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్