Saturday, July 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఏపికి ‘మేఘా’ ఆక్సిజన్ ట్యాంకర్లు

ఏపికి ‘మేఘా’ ఆక్సిజన్ ట్యాంకర్లు

సింగపూర్ నుంచి 3 ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు యుద్ధ ప్రాతిపదికన తెప్పించి ఏపి ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.  రక్షణ శాఖ ప్రత్యేక విమానం లో పశ్చిమ బెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి ఈ ట్యాంకర్లు చేరుకున్నాయి.

కోవిడ్ విపత్తులో రోగుల అవ‌స‌రాల‌తో పాటు, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి తమ వంతు సాయంగా అందించింది  మేఘా సంస్థ.

ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ నింపుకుని అక్కడినుంచి ఏపీకి ఈ ట్యాంకులు చేరుకుంటాయి,

తెలుగు రాష్ట్రాలకు థాయ్‌లాండ్, సింగపూర్లనుండి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తోంది మేఘా సంస్థ. గతవారం తెలంగాణాకు కూడా ఇదేవిధంగా ఆక్సిజన్ అందించింది.

థాయ్‌లాండ్ నుండి తెలంగాణకు  11, ఏపికి సింగపూర్ నుండి 3 ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు ఇప్పటిక్దాకా అందించింది. హైదరాబాదు లోని  బొల్లారంలో ఇప్పటికే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని MEIL ప్రారంభించింది.

తెలంగాణ , ఏపి, ఒడిషాల్లో కోవిడ్ ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటోంది.  గత మూడు వారాలుగా 56014 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరాను మూడు రాష్ట్రాలకు అందజేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్