Friday, March 29, 2024
HomeTrending Newsముంపు ప్రాంతాల్లో మంత్రి  ఇంద్రకరణ్

ముంపు ప్రాంతాల్లో మంత్రి  ఇంద్రకరణ్

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో నిర్మల్ ముంపు  ప్రభావిత ప్రాంతాల్లో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప‌ర్యటించారు. జీయన్ఆర్ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని నేరుగా తెలుసుకున్న మంత్రి వారిని ఓదార్చారు.  ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి  భరోసానిచ్చారు. వరద పరిస్థితి, సహాయ చర్యలపై ఆరా తీశారు. వరదలు, భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం వివరాలను, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.  బాధితులకు తక్షణ సహాయం  సహాయం అందించేందుకు దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు.  ప్రకృతి విలయం కారణంగా సాధారణ ప్రజలతో పాటు రైతులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

స్వర్ణ ప్రాజెక్ట్ లోకి ఊహించని విధంగా వరద నీరు రావడంతో గేట్లు ఎత్తివేశారని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు.  ఇన్ ఫ్లో తగ్గడంతో వరద తగ్గుముఖం పట్టిందన్నారు. అధికారులు, సిబ్బంది నిన్నటి నుంచే సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.  బాధితులకు అన్ని విధాలా అండగా ఉండి, సహాయం చేస్తామని వెల్లడించారు.

మంత్రి వెంట ఐజీ నాగిరెడ్డి,   జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తదితరులు ఉన్నారు.

సారంగాపూర్ మండలంలో మంత్రి పర్యటన

సారంగాపూర్ మండలం గోపాలపేట లో  వరద ఉదృతికి  కూలీ పోయిన వంతెనను పరిశీలించారు. వంతెన కూలీ పోవడంతో గోపాలపేట గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. వరద తగ్గిన వెంటనే  యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించేలా చూడాలని  మంత్రి అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్