Friday, March 29, 2024
HomeTrending Newsఢిల్లీ పార్టీల సిల్లి పాలిటిక్స్ –కేటిఆర్

ఢిల్లీ పార్టీల సిల్లి పాలిటిక్స్ –కేటిఆర్

తెలంగాణ లో MIM కి ఎవ్వరూ భయపడటం లేదని, కేవలం బీజేపీ భయపడుతోందని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు ఎద్దేవా చేశారు. బీజేపీ ఆదిలాబాద్ కి ట్రైబెల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు ఇచ్చారా అన్న కేటిఆర్ సాయుధ పోరాటం చేసిన  నేతలకు పెన్షన్స్ ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడం లేదన్నారు. టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె .టీ .రామారావు తెలంగాణ భవన్ లో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు ఒక్క దాని గురించి అయినా చెప్పారా? ఎంపిలుగా గెలిచి బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎమ్ చేశారని కేటిఆర్ అన్నారు.

ఢిల్లీ పార్టీలు సిల్లి పాలిటిక్స్ చేస్తున్నాయని, కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని పార్టీలు ఎందుకు పుట్టాయో ప్రజలకు తెలుసని మంత్రి కేటిఆర్ విమర్శించారు. కొత్త పార్టీలు కేసీఆర్ మీద మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నాయి- ఢిల్లీ పార్టీల పై ఎందుకు మాట్లాడరన్నారు. కాంగ్రెస్- బీజేపీ పై షర్మిల- ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదని, టీఆరెస్ ఓటును చీల్చడానికి ఉద్భవించిన పార్టీలు షర్మిల- ప్రవీణ్ కుమార్ అన్నారు.

తెలంగాణలో టీఆరెస్ ప్రజలకు లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ అని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటేనే- దేశంలో ఎక్కడా లేని ప్రథకాలు అమలు అవుతున్నాయా అని కేటిఆర్ అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే తెలంగాణకు పెట్టుబడులు- తెలంగాణ అభివృద్ధి అగుతుందా అన్న కేటిఆర్ ప్రతిపక్ష నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఎవ్వరిని వదిలిపెట్టం- గుడ్డలు ఉడధిస్తాం- పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్ లో నాలుగు ఇండ్లు ఎట్లా వచ్చాయన్నారు. అందరి భాగోతం మా దగ్గర ఉంది- అన్ని బయట పెడుతామన్నారు.

కాంగ్రేస్ కు హుజురాబాద్ లో డిపాజిట్లు వస్తాయా అన్న కేటిఆర్ పీసీసీ కొనుకున్నోడు- రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా అని ప్రశ్నించారు. రాష్ట్రం గురించి ఒక ఎంపీ మాట్లాడితే అతన్ని గాడిద అంటావా? దళితబంధు అనేది.1990లోనే సిద్దిపేట లో ఉన్నదని, కాంగ్రేస్ 60 ఏళ్ల రాజకీయ పాలనలో దళితులకు దళితబంధు పథకం లాంటిది ఎప్పుడైనా పెట్టారా అని మండిపడ్డారు. బీసీ బంధు కావాలంటున్న బండి సంజయ్ దేశంలో ఉన్న ప్రతి బీసీలకు- బలహీన వర్గాలకు లక్షలు లక్షలు పంచాలని మోడీకి చెప్పండి. మతం పేరుతో చిల్లర డ్రామాలు మాకు రావన్నారు.

నాకు డ్రగ్స్ కు ఎమ్ సంబంధం- నా రక్తం- వెంట్రుకలు ఇస్తా ఏ పరిక్షకైనా సిద్ధం- మరి రాహుల్ గాంధీ ఇస్తాడా అని కేటిఆర్ సవాల్ విసిరారు. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం, ED కి లెటర్ ఇచ్చిన వాడు బఫున్ అన్నారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతాం- అవసరం అయితే రాజద్రోహం కేసులు కూడా పెడుతామని హెచ్చరించారు. అడ్రెస్ లేని వ్యక్తులు కేసీఆర్ ని తిడితే ఉరుకోము. ఉద్యమంలో కేసీఆర్ తిడితే ఆనాడు ఉద్వేగం ఉందన్నారు.

సింగరేణి బాలిక ఘటన పై చట్టం తన పని తాను చేసుకుందని, దిశ ఘటన పై దేశం హర్షించింది- నాకు కూతురు ఉంది కన్నీళ్లు పెట్టుకున్నామని కేటిఆర్ చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంను స్పూర్తిగా తీసుకుంటామని, ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి- ఇవ్వాళ కన్నాలు వేస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోందన్నారు. క్రిమినల్స్ కు ఛార్జిషీట్స్ మాత్రమే తెలుసు! రోజు కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు మాత్రమే చార్జిషీట్లు అంటరు. ఈటెల రాజేందర్ జానారెడ్డి కంటే పెద్దవాడు కాదు కదా!. జానారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి- చిన్న పిలగాడు ఓడించాడన్నారు. హుజురాబాద్ లో టీఆరెస్ కచ్చితంగా గెలుస్తుందని,   బండి సంజయ్ కు ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారని మంత్రి కేటిఆర్ విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్