Thursday, April 25, 2024
HomeTrending Newsఫోటోగ్రాఫర్ వల్లే ఈ స్థాయికి: మంత్రి రోజా

ఫోటోగ్రాఫర్ వల్లే ఈ స్థాయికి: మంత్రి రోజా

కాలేజీలో ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఓ ఫోటో వల్లే తానునటిగా మారి హీరోయిన్ అయ్యాయని, ఇప్పుడు మంత్రిగా ఉన్నానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రాజకీయ నేతలను కూడా ఫోటోలు, వీడియోలు ఎంతో ఎలివేట్ చేస్తాయని చెప్పారు. ప్రళయకారుడు శివుడికి మూడో కన్ను ఉన్నట్లే ఫోటోగ్రాఫర్లకు కూడా మూడో కన్ను ఉంటుందని అది వీడియో, ఫోటో కెమెరా అని అభివర్ణించారు. విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుతుతోన్న కెమెరా, ఫోటో ఎక్స్ పో లో మంత్రి రోజా పాల్గొన్నారు. అనంతరం విజయవాడలో ఫోటో గ్రాఫర్స్ ‘ఒన్ క్లిక్ ఆన్ సేమ్ టైమ్ – వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫోటో గ్రాఫర్ల ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా ఫోటోటెక్ మరియు ఫొటో మరియు వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Also Read : మంచి చేశాం కాబట్టే ధైర్యం: రోజా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్