Tuesday, September 17, 2024
HomeTrending Newsకుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌

కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యంపై మంత్రుల స‌మీక్ష‌

రాష్ట్రంలోని వివిధ కుల‌వృత్తుల వారికి బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై ఈ రోజు మంత్రులు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. హైదరాబాద్ లోని బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్ స‌మీక్ష చేప‌ట్టారు. చేనేత‌, గీత కార్మికులు, మ‌త్స్య‌కారుల‌కు బీమా సౌక‌ర్యంపై భేటీలో చర్చించారు. ఈ స‌మావేశంలో మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌, ప‌లుశాఖ‌ల అధికారులు, బ్యాంక‌ర్లు, ఎల్ఐసీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు. రైతు బీమా మాదిరే కుల‌వృత్తుల వారికి కూడా త‌క్ష‌ణ‌మే బీమా ప‌రిహారం అందేలా చూస్తామ‌ని ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో తీర్మానించిన సంగ‌తి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్