Friday, April 19, 2024
Homeసినిమాచైతన్య, పరశురామ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?

చైతన్య, పరశురామ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?

అక్కినేని నాగచైతన్య, పరశురామ్ కాంబినేషన్లో ఓ మూవీని గతంలో ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకుంది. ఇక షూటింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో పరశురామ్ కి సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అదే.. ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా గత సంవత్సరం మేలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించపోయినా హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో పరశురామ్ మూవీ ఉంటుంది అనుకున్నారు. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుందని వార్తలు వచ్చాయి.

సర్కారు వారి పాట విడుదలై ఏడు నెలలు గడుస్తున్నా.. చైతన్య, పరుశురామ్ ల సినిమా పట్టాలెక్కలేదు. దీంతో అందరూ ఈ సినిమా ఆగిపోయిందనే భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చాలానే వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే.. పరశురామ్ రాసిన కథ… చైకి నచ్చలేదని తెలుస్తోంది. స్క్రిప్టు విషయం పూర్తి స్థాయిలో సంతృప్తి లేకపోవడంతో.. నాగ చైతన్య సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం. ఇంతకీ కథ ఏంటంటే… ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉన్న హీరో ఓ కంపెనీలో చేరి అక్కడే ఉన్న లేడీ బాస్ తో లవ్ ట్రాక్ నడుపుతాడట.

ఇందులో హీరోయిన్ డామినేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని.. అందుకే చై ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. చైతన్య ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో డైరెక్టర్ పరుశురామ్ విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి అనుకుంటున్నారు. అయితే.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం’ సూపర్ సక్సెస్ సాధించడంతో.. మరోసారి వీరిద్దరూ కలిసి పని చేయాలి అనుకుంటున్నారట. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే… 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతుంది. మరి.. చై నెక్ట్స్ ఎవరితో ఉంటుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్