Monday, February 24, 2025
HomeTrending Newsనాటా సభలకు సిఎంకు ఆహ్వానం

నాటా సభలకు సిఎంకు ఆహ్వానం

వచ్చే ఏడాది జరిగే తెలుగు మహాసభలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని నాటా కార్యవర్గ సభ్యులు ఆహ్యానించారు. 2023 జూన్‌ 30 – జులై 02 వరకు డాలస్‌లోని డాలస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాటా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్‌ రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలుసుకొని మహాసభలకు హాజరు కావాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్