Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవరిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలన్నది కేంద్రం కుట్రగా ఉందన్నారు. ఏపి నుండి రావాల్సిన 12,900 కోట్లబకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, కేంద్రానికి మొర పెట్టుకున్నా స్పందించలేదని మంత్రి వెల్లడించారు. విద్యుత్ తోపాటు,బకాయిలు, పిపిఏలలోను ఎపి, తెలంగాణకు నష్టమే చేసిందని, ఒక్కరోజు కుడా కేంద్రం జోక్యం చేసుకోలేదన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట దక్కేలా లేదని, గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలలో విద్యుత్ రంగం సంక్షోభంలో కురుకుపోయిందని అన్నారు.

దేశ రాజధానితో సహా అన్ని రాష్ట్ర రాజధానిలలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని, ఎటువంటి కోతలు లేనిది ఒక్క తెలంగాణలోనే అని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను బిజెపి సర్కార్ జీర్ణించుకోలేక పోతుందని, ఆందుకే బిజెపి సర్కార్ కు కంటగింపు అని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కు అడ్డుపుల్ల వేసేందుకే..రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. కృష్ణా ,గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం అదే ధోరణి అవలంబింస్తోందని, అపెక్స్ మీటింగ్ పెట్టాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ణప్తిని పట్టించుకోలేదన్నారు.

ఎపి నుండి రావాల్సిన 12,941 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉందని, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని మంత్రి విమర్శించారు. నెల రోజుల్లో చెల్లించాలి అనడం ముమ్మాటికీ దుర్మార్గమేనని, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంగా ఈ విధంగా వ్యవహరించటం సరికాదన్నారు. తెలంగాణను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలని, మోటర్లకు మీటర్లు పెట్టను అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకే ఈ దుశ్చర్య అని మండిపడ్డారు. కేంద్రానికి ఏపీ లేఖలే కనిపిస్తున్నాయని, తెలంగాణ లేఖలు మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.

Also Read : ఏపీ బకాయిలు చెల్లించండి: తెలంగాణకు కేంద్రం ఆదేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com