ప్రామిసింగ్ యాక్టర్స్ శర్వానంద్, సిద్ధార్ధ్ కలిసి నటిస్తోన్న ‘మహా సముద్రం’. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘చెప్పకే..చెప్పకే’ పాటను ఈ నెల 6న విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో హీరోయిన్ అదితిరావు హైదరి స్టన్నింగ్ లుక్లో కనిపిస్తోంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన మాస్ సాంగ్ ‘హే రంభ’ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రెండవ పాట స్వీట్-సౌండింగ్ నంబర్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె.ఎల్ ఎడిటర్, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 14న ‘మహా సముద్రం’ విడుదలవుతుంది.