Wednesday, June 17, 2026
HomeTrending Newsసిఎం జగన్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు

సిఎం జగన్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు

నూతనంగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్సీలు నేడు అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎనికైన  నర్తు రామారావు (శ్రీకాకుళం); కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌ (పశ్చిమ గోదావరి); తూర్పు రాయల సీమ (ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు) ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డిలు సిఎంను కలుసుకున్న వారిలో ఉన్నారు.

 

నూతన ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి అభినందించగా…. తమకు అవకాశం కల్పించినందుకు సీఎంకు ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read : టిడిపి వెంట గ్రాడ్యుయేట్లు, వైసీపీని గెలిపించిన టీచర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular