Monday, February 24, 2025
HomeTrending NewsNepal: నేపాల్ లో హెలికాప్టర్ అదృశ్యం.. ఆరుగురు గల్లంతు

Nepal: నేపాల్ లో హెలికాప్టర్ అదృశ్యం.. ఆరుగురు గల్లంతు

నేపాల్‌లో హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైంది. హెలికాప్ట‌ర్‌లో నేపాల్ పైల‌ట్‌తో పాటు ఆరుగురు మెక్సికో పౌరులు ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ప్రమాదానికి గురైనట్టు ప్రాథమిక సమాచారం. సోలుకుంబు జిల్లాలోని లంజురా ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలు కనుగొన్నారు. ఎవరెస్ట్ శిఖరం చూసేందుకు వచ్చిన విదేశీ పర్యాటకులు చనిపోయినట్టుగా అధికారులు దృవీకరించారు.

సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్.. 15 నిమిషాల త‌ర్వాత కంట్రోల్ ట‌వ‌ర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘ‌ట‌న ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం 10:15 గంట‌ల‌కు జ‌రిగింది. అదృశ్య‌మైన చాప‌ర్‌ను మ‌నాంగ్ ఎయిర్ హెలికాప్ట‌ర్‌గా అధికారులు నిర్ధారించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్