Thursday, April 25, 2024
HomeTrending Newsబిజెపి పాలనపైనే ప్రధాన చర్చ: ఉండవల్లి

బిజెపి పాలనపైనే ప్రధాన చర్చ: ఉండవల్లి

KCR-Undavalli: తెలంగాణా సిఎం కేసిఆర్ తో జరిగిన సమావేశంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా చర్చ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. నిన్న ప్రగతి భవన్ లో కెసిఆర్ తో ఉండవల్లి మూడు గంటలపాటు సమావేశమైన సంగతి తెలిసింది. వీరిద్దరి కలయికపై తెలుగు రాష్ట్రాలో రాజకీయ చర్చ జరిగింది.  హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఉండవల్లి మీడియా సమావేశంలో నిన్నటి సమావేశ వివరాలని తెలియజేశారు.

కేసీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసి పిలిస్తేనే ఆయ‌న‌తో భేటీ అయ్యాన‌ని,  మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ భేటీలో ఎలాంటి పార్టీ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్ళిన తనను మంత్రి హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నారని, ఆ త‌ర్వాత కేసీఆర్‌తో త‌న‌ భేటీలో హ‌రీశ్‌తో పాటు మ‌రో మంత్రి, ఓ ఎంపీ పాల్గొన్నార‌ని ఆయ‌న చెప్పారు. తాము చ‌ర్చించుకున్నంత సేపు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా అక్క‌డే ఉన్నార‌ని తెలిపారు. అయితే ప్ర‌శాంత్ కిశోర్ చ‌ర్చ‌లో పాలుపంచుకోలేద‌ని, తాము మాట్లాడుకుంటూ ఉంటే ఆయ‌న వింటూ ఉన్నారని  తెలిపారు. ఏపీలో అన్ని పార్టీల కంటే బీజేపీనే బ‌ల‌మైన పార్టీ అని ఉండ‌వ‌ల్లి చెప్పారు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే భావించాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ భేటీలో రాజ‌కీయాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింద‌న్న ఉండ‌వ‌ల్లి… బీఆర్ఎస్ గురించి మాత్రం ప్ర‌స్తావ‌న రాలేద‌న్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాల‌న‌పైనే చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. దేశంలో మోదీ పాల‌న‌ను వ్య‌తిరేకించే వారిలో కేసీఆరే బ‌ల‌మైన నేత‌గా ఉన్నార‌న్నారు. తాను బీజేపీకి వ్య‌తిరేకం కాద‌ని చెప్పిన ఉండ‌వ‌ల్లి… ఆ పార్టీ విధానాలతో తాను వ్య‌తిరేకిస్తాన‌ని చెప్పారు. బీజేపీ విధానాలు ఇప్పుడున్న‌ట్లుగా మ‌రింత మేర పెరిగితే ప్ర‌మాద‌మేన‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. ఈ విష‌యంపైనే తాము ప్ర‌ధానంగా చ‌ర్చించుకున్నామ‌న్నారు. కేంద్రంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే దిశ‌గా కేసీఆర్ సుదీర్ఘ క‌స‌ర‌త్తే చేశార‌న్నారు. బీజేపీపై కేసీఆర్‌తో పాటు త‌న‌దీ ఒక‌టే అభిప్రాయ‌మ‌ని ఆయ‌న చెప్పారు.

ఇక కేసీఆర్‌తో క‌లిసి తాను మ‌ధ్యాహ్న భోజ‌నం చేశాన‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. త‌న‌ను కేసీఆర్ ఆహ్వానిస్తే… సీఎంఓ నుంచి తాను వెజ్ తింటానా?  నాన్ వెజ్ తింటానా?అంటూ ఆరా తీసింద‌ని ఆయన చెప్పారు. త‌న‌తో పాటు కేసీఆర్ కూడా వెజిటేరియ‌నే తిన్నార‌ని చెప్పారు. ఆదివారం నాడు నాన్ వెజిటేరియ‌న్లు మాంసాహారం తినేందుకు ఆస‌క్తి చూపుతార‌ని, అయితే కేసీఆర్ ఏం తింటారో త‌న‌కు తెలియ‌ద‌ని, త‌నతో క‌లిసి వెజ్ మాత్ర‌మే తిన్నార‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌శాంత్ కిశోర్ కూడా త‌మ‌తో క‌లిసి లంచ్ చేశార‌ని ఆయ‌న చెప్పారు. తాను అర‌గంట మాట్లాడితే కేసీఆర్ రెండున్న‌ర గంట‌లపాటు మాట్లాడార‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్