Thursday, February 27, 2025
Homeస్పోర్ట్స్సింధు ఓటమి!

సింధు ఓటమి!

టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్లో ఇండియన్  బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి. సింధు ఓటమి పాలయ్యారు. చైనీస్ తైపీకి చెందిన తైజుయింగ్ 21-18, 21-12 తేడాతో సింధుపై గెలిచారు. హోరాహోరీగా సాగిన మొదటి సెట్ ను గెల్చుకున్న కొద్ది తేడాతో గెల్చుకున్న తైజుయింగ్  రెండో సెట్లో అలవోకగా తన ఆధిపత్యం కొనసాగించింది.

డ్రాప్ షాట్ల ను సింధు సరిగా అంచనా వేయలేకపోయింది. ఆట తొలి పది నిమిషాలు మాత్రమే సింధు తన ఆధిపత్యం చూపింది. ఆ తరువాత తైజుయింగ్ జోరు కొనసాగింది. ఆదివారం (ఆగస్ట్ 1) జరిగే మ్యాచ్ లో చైనాకు చెందిన హే బింగ్ జియాతో కాంస్య పతకం కోసం సింధు తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్