Saturday, April 20, 2024
HomeTrending Newsగుజరాత్ తో తెలంగాణ ఎన్నికలు-రేవంత్

గుజరాత్ తో తెలంగాణ ఎన్నికలు-రేవంత్

హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని పిసిసి అధ్యక్షుడు రేవంత రెడ్డి అన్నారు. విజయ గర్జన సభ..పార్టీలో తిరుగుబాటును ఎదుర్కోడానికేనన్నారు. కేసీఆర్.. భయంతోనే వున్నారు.. దాన్ని బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని రేవంత్ చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో ఈ రోజు చిట్ చాట్ చేసిన రేవంత్ రెడ్డి ముందస్తు రాదని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావు..6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్నారు.

తెరాస ప్లీనరీ, విజయ గర్జన సభ .. భయంలోనే పెడ్తుండని, ఇవే టీఆరెఎస్ పార్టీకి చివరి సభలని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్ రావు ను కూడా త్వరలో పార్టీ నుండి బయటికి పంపుతాడని, మిత్ర ద్రోహి పేరుతో.. స్మశాన వాటికకు పంపుతాడన్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత పార్టీలో తిరుగుబాటు వస్తదన్న రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ గెలిచిన ఓడిన ఎవరికి లాభం లేదన్నారు. గుజరాత్ తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయన్నారు.

2022 ఆగస్ట్ 15 తో.. 75 ఏళ్లు పూర్తవుతుంది మనకు స్వాతంత్య్రం వచ్చి..ఆ సందర్భంగా.. కొత్త శకానికి నాంది అని కేసీఆర్.. ఎన్నికలకు వెళ్తారని రేవంత్ జోస్యం చెప్పారు. మోడీ డైరెక్షన్ లో కేసీఆర్.. గుజరాత్ తో పాటు ఎన్నికలకు వెళ్తారని, రాష్ట్రంలో బిజేపి ని బలోపేతం చేసే.. కుట్ర జరుగుతోందన్నారు. ముందస్తు ఎన్నికలు అంటే.. పార్టీలో మరింత గందరగోళం వస్తదని.. చెప్పడం లేదని, ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్తితి లేదు కాబట్టి వారిని ముందస్తుగానే అలర్ట్ కాకుండా కెసిఆర్ ఈ డ్రామాకు తెరలేపారు. ఎవరు అడిగారు.. ముందస్తు ఎన్నికల విషయం.. ముందస్తుపై మాట్లాడటానికి అన్న రేవంత్ మరో రెండేళ్లు నా సర్కార్ అధికారంలో వుందని.. చెప్పకనే చెప్పే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నాడు అన్నారు.

విజయ గర్జన ఎందుకు.. ఏం సాధించాడని, ఎంపీలు 16 గెలుస్తా.. కేంద్రంలో చక్రం తిప్పుతా.. అంటే దేనికి సంకేతం, టీఆరెఎస్ మ్యానిఫెస్టోలో.. దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్త అని వుంది. దళితలు.. సీఎం పదవి కావాలని అడగలేదు. దళిత సీఎం అని, మూడు ఎకరాలని కెసిఆర్ వారిని మోసం చేసిండని రేవంత్ విమర్శించారు. దళిత బంధు కూడా అడగలేదు.. వాళ్లు అడిగింది a,b,c,d వర్గీకరణ అని గుర్తు చేశారు. కేసీఆర్ ఇన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసినవ్.. ఎప్పుడైనా ఈ విషయం మోడీకి చెప్పినవా అని ప్రశ్నించారు.

కేసీఆర్..దళిత ద్రోహి..సొంత పార్టీ లో దళితులకు ప్రాధాన్యత లేదని, పార్టీ అధ్యక్ష పదవి కోసం.. కేసీఆర్ నామినేషన్ వేసే సమయంలో.. ఒక్క దళితుడు కూడా లేడని రేవంత్ ధ్వజమెత్తారు. నిన్న వేదికపై కూడా కేసీఆర్ పక్కన దలితున్ని కూర్చోబెట్టుకొలేదని, దళిత ద్రోహి నాయకత్వంలో.. మరో దళిత నాయకుడు మోత్కుపల్లి జాయిన్ అవుతుండన్నారు.

యూపీ ఎన్నికల్లో కేసీఆర్ సహకారం.. బిజేపికి వుంటుందని, దాని వెనక అంతర్గత ఒప్పందం జరిగిందని రేవంత్ చెప్పారు. కేసులు, దాడులు జరగకుండా.. ఒప్పందం జరిగిందని, గుజరాత్ ఎన్నికల సమయానికి సర్కార్ ను కెసిఆర్ డిజాల్వ్ చేస్తాడని, సర్కార్ ను నడపాల్సిన సమయంలో పార్టీ పై కేసీఆర్ దృష్టి పెట్టడం ఏంటీ అని ప్రశ్నించారు. టీఆరెఎస్ లో జరుగుతున్న పరిణామాలన్ని ముందస్తు ఎన్నికల కోసమే అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్