Tuesday, March 10, 2026
HomeTrending Newsఢిల్లీలో భారీ కుట్ర భగ్నం

ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం

స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 55 తుపాకులు, 50 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్ లు ఉన్నాయి. ఈ నలుగురు ఆయుధాల అక్రమ రవాణా ముఠా సభ్యులుగా భావిస్తున్నారు.
అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీ వాసి కాగా, మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. డ్రోన్లు, బెలూన్లపై నిషేధం విధించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular