Saturday, July 27, 2024
Homeసినిమా'PS -2': ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై సందడి చేసిన భారీతారాగణం! 

‘PS -2’: ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై సందడి చేసిన భారీతారాగణం! 

లైకా ప్రొడక్షన్స్ – మణిరత్నం కలిసి నిర్మించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ భారీ చారిత్రక చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్ 2’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ తో టీమ్ బిజీబిజీగా ఉంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటును నిన్న రాత్రి హైదరాబాదులో నిర్వహించారు. ‘నొవాటెల్ కన్వెన్షన్ సెంటర్’లో ఈ వేడుక ఘనంగా జరిగింది.

ఫస్టు పార్టును తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన దిల్ రాజునే, సెకండ్ పార్టును కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి దర్శక నిర్మాతలతో పాటు భారీ తారాగణమంతా తరలిరావడం విశేషం. విక్రమ్ డిఫరెంట్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన లుక్ పూర్తిగా కొత్తగా అనిపించింది. ఇక కార్తి .. జయం రవి కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. ఎవరి పాత్రను గురించి వారు చెబుతూనే, ఇతర పాత్రలకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించారు.

సుహాసినితో పాటు ఐశ్వర్య రాయ్ .. త్రిష .. ఐశ్వర్య మీనన్ కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. ఐశ్వర్యరాయ్ నిండుగా ..  కనుల పండుగలా కనిపించారు. ఆమె చక్కదనం .. హుందాతనం ఈ ఫంక్షన్ కి ప్రత్యేకమై ఆకర్షణగా నిలిచాయి. ఇక త్రిష కూడా చాలా గ్లామరస్ గా మెరిసింది. ఐశ్వర్య మీనన్ తన ప్రత్యేకతను చేరుకోవడానికి ప్రయత్నించింది. అందరూ కూడా ఈ సినిమా విశేషాలను గురించి ప్రస్తావిస్తూ .. సపోర్ట్ చేయమని కోరారు. చూస్తుంటే సెకండ్ పార్టు ఇక్కడ గట్టివసూళ్లనే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్