Saturday, April 20, 2024
HomeసినిమాWar 2: ప్రభాస్ నో చెప్పాడా.. అందుకే ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లిందా..?

War 2: ప్రభాస్ నో చెప్పాడా.. అందుకే ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లిందా..?

ప్రభాస్ వరుసగా సినిమలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.’ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, మారుతితో ఓ సినిమా, ‘స్పిరిట్’.. ఇలా వరుస ప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. అయితే.. ఈ సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ప్రభాస్ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీ అని… ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబో అని.. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్టర్ అని.. ఇదే ‘వార్ 2’ మూవీ అని టాక్ వినిపించింది. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ప్రభాస్ కాకుండా ఎన్టీఆర్ నటిస్తున్నారని ప్రకటించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే… ప్రభాస్… హృతిక్ రోషన్ తో కలిసి సినిమా చేయడానికి నో చెప్పారట.హృతిక్ అనే కాదు.. వేరే హీరోలతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి ప్రభాస్ ఇంట్రస్ట్ చూపించడం లేదట. బాలీవుడ్ లో మల్టీస్టారర్స్ ట్రెండ్ నడుస్తుంది. తెలుగులో ఫర్ ఫెక్ట్ ఈమధ్య కాలంలో ఆర్ఆర్ఆర్ తో స్టార్ట్ అయ్యింది. అయితే… తెలుగులో మల్టీస్టారర్ చేయడానికి మన హీరోలు అంతగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. బన్నీ పుష్ప 2 కావచ్చు, రామ్ చరణ్ లైనప్ కావచ్చు ఇదే చెబుతున్నాయి. దాదాపు తెలుగు హీరోలు అంతా భారీ సోలో పాన్ ఇండియా సినిమాలే సెట్ చేసుకుంటున్నారు.

ప్రభాస్ చేస్తున్నవి భారీ బాలీవుడ్ సినిమాలే. ఆదిపురుష్, సలార్ లాంటివి తెలుగు వరకు చూసుకుంటే డబ్బింగ్ సినిమాలే. కానీ అలాంటి ప్రభాస్ కూడా బాలీవుడ్ లో మల్టీ స్టారర్లు చేయడానికి అంగీకరించడం లేదట. అసలు వార్ 2 సినిమా చేయలేకపోవడానికి కారణం ఇదే అని సమాచారం. హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ప్రభాస్ పెద్దగా ఇష్టపడలేదని తెలుస్తోంది. ప్రభాస్ ఒప్పుకుని వుంటే ఈ సినిమాను మైత్రీ సంస్థ చేయాల్సి వుంది. ఇప్పుడు మైత్రీ మరో ప్రాజెక్ట్ ను ప్రభాస్ కు సెట్ చేయాల్సి వుంది. మరి.. భవిష్యత్ లో అయినా ప్రభాస్ మల్టీస్టారర్ కి ఓకే చెబుతాడో లేదో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్