Saturday, April 20, 2024
Homeసినిమాప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తీర్చేసిన పఠాన్

ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తీర్చేసిన పఠాన్

ప్రభాస్ ‘ఆదిపురుష్‌’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే‘, మారుతితో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తైన తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నారు. అయితే.. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ఎప్పటి నుంచో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే.. సిద్ధార్థ్ ఆనంద్ సినిమా అంటే.. ఆయన సినిమాల్లో యాక్షన్ పార్ట్ ఎక్కువుగా ఉంటుంది.. స్టోరీ తక్కువుగా ఉంటుందనే కంప్లయింట్ ఉంది.

దీంతో ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో మూవీ అని తెలిసినప్పటి నుంచి అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ప్రభాస్ నటించిన సాహో తాలుకా అనుభవాలను అభిమానులు ఎవరూ మర్చిపోలేదు. కారణం ఏంటంటే.. ఆ సినిమాలో కూడా స్టోరీ తక్కువ.. యాక్షన్ ఎక్కువ. అదే పెద్ద మైనస్ అయ్యింది. అయితే.. సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘పఠాన్’. షారుఖ్ హీరోగా నటించిన మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైంది. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డు స్థాయి ఓపెనింగ్ రాబట్టింది.

దీంతో సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆయన స్టార్ పవర్ ను వాడుకొని ఎలివేషన్లను పండించడంలో  దిట్ట. ఇలా చేసే అతడు మూడు హిట్లను కొట్టాడు. అయితే.. పఠాన్ సినిమాకు ముందే హృతిక్, ప్రభాస్ కాంబోలో వార్ 2 తీయాలనుకున్నప్పటికీ సాధ్య పడలేదు. దీంతో ముందు ఫైటర్ తీయబోతున్నాడు. వచ్చే ఏడాదిలోగా ఈ సినిమాను పూర్తి చేసుకొని ప్రభాస్ సినిమాను పట్టాలెక్కించాలి అనేది ప్లాన్. ఈలోపు ప్రభాస్ తను చేస్తున్న సినిమాలు కంప్లీట్ చేస్తాడు. మరి.. ఈ క్రేజీ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో…

RELATED ARTICLES

Most Popular

న్యూస్